ఉస్మానియా వర్సిటీలోని మానేర్ హాస్టల్ బాత్రూమ్లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే..ఆత్మహత్య చేసుకున్న మురళీ ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి లోనై మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. మురళి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.. “అమ్మా నన్ను క్షమించు.. ఈ చదువులు భరించలేకపోతున్నా.. ఇంకా తట్టుకోవడం నావల్ల కాదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. అన్నయ్య అమ్మను మంచిగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకున్నానని అమ్మకు తెలియనివ్వకు” అని సూసైడ్ నోట్లో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
