కొత్త బిక్షగాడు పొద్దు ఎరుగడు అన్నట్లు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వైఖరి ఉందని ఎంపీ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. రేవంత్ నిన్న సంస్కార హీనంగా మాట్లాడిండని…పెద్ద వారిపై మాట్లాడితే పెద్దవాన్ని అవుతనని ఊహించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ లాంటి పిచ్చి కుక్కల గురించి ఆలోచించే సమయం తమకు లేదని అన్నారు. రేవంత్ కు కేసుల సోకు ఎక్కువగా ఉందని ఎంపీ సుమన్ ఎద్దేవా చేశారు. నోట్ల కట్టలతో దొరికి చంచల్ గూడ జైల్ కు వెళ్లినా ఇంకా కేసుల సోకు తగ్గలేదని ఆయన వ్యాఖ్యానించారు.
`కేటీఆర్ కు పెళ్లి అయింది ఎప్పుడు, ఆయన ఉద్యోగం చేసింది ఎప్పుడు..ఆనాటి కి పుట్టని టిఆర్ఎస్ కు అంట గట్టటం పిచ్చి మాటలే..నిన్న మొన్నటి వరకు అధికారం లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ లు ఎందుకు దీనిపై విచారణ జరపలేదు?“ అంటూ రేవంత్ చేసిన విమర్శలను ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా తిప్పికొట్టారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఇలాంటి చిల్లరగాళ్లను ఎలా చేర్చుకుంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల భార్యలది ఏ కులమని తాము ఆడిగినమా అని సుమన్ ప్రశ్నించారు. `మీ చరిత్రలు కూడా తవ్వమంటారా? వ్యక్తి గత విమర్శలు చేస్తే వేదిక మీద ఉన్న నాయకులు ఎందుకు మాట్లాడరు? మణిశంకర్ అయ్యర్ ను సస్పెండ్ చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోరు.` అంటూ ఎంపీ సుమన్ సూటిగా ప్రశ్నించారు.
మొరిగె కుక్కలకు తెలంగాణ ప్రజలే బుద్ది చెబుతారని ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. `రేవంత్ జర నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డ` అని హెచ్చరించారు. రేవంత్ ను తెలంగాణ ప్రజలు బొంద పెడతరని స్పష్టం చేశారు. తెలంగాణే…కేసీఆర్ కులం మతం అని ఆయన స్పష్టం చేశారు. `రేవంత్ నువ్ రవ్వంత, కేసీఆర్ ఆకాశమంత` అని స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసీఆర్ అభిమానులు ఉన్నారని.. వారు రేవంత్ నోటిని ఫినాయల్ తో కడుగుతారని ఎంపీ సుమన్ అన్నారు.