ఆత్మహత్యకు పాల్పడిన తెలుగు హాస్యనటుడు విజయ్ సాయి కేసులో కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి. విజయ్ తండ్రి కెవి సుబ్బారావు ఓ వార్త చానల్తో మాట్లాడుతూ..తమ ఇంట్లో వనిత బంగారం దొంగతనం చేసిందని, చాలా వస్తువులు మాయం చేసిందని అయన ఆరోపించారు. కోడల్ని కూతురిలా చూసుకున్నామని, చనిపోయిన తన కొడుకుపై లేనిపోని అభాండాలు వేయడం భావ్యం కాదన్నారు. తాము గౌరవంగా బతుకుతున్నామన్నారు. కాగా, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో తన భర్త మృతదేహాన్ని చూసి విజయ్ సాయి భార్య వనిత కన్నీటిపర్యంతమయ్యారు.
