హైదరాబాద్ నగర రోడ్లు మరింత సొబగులను అద్దుకోనున్నాయి. ఇంకా చెప్పాలంటే…నాలుగు నెలల్లో నగర రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. రూ.454.75 కోట్లతో రోడ్లు వేయాలని బల్దియా నిర్ణయించింది. మార్చి 31లోపు ఈ పనులు పూర్తిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొదట పనులు పూర్తిచేసి అనంతరం అంతర్గత రోడ్లు వేయనున్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పనులు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పనులపై ఇప్పటికే పలుమార్లు నిపుణులతో చర్చలు జరిపిన బల్దియా అధికారులు మొదటిసారి రోడ్మ్యాప్ రూపొందించారు. ఎక్కడెక్కడ వైట్టాపింగ్, సీసీ, బీటీ రోడ్లు వేయాలో పక్కాగా ప్రణాళిక రూపొందించడంతో పాటు, ప్రతీ ఏడాది ఏయే నెలల్లో రోడ్లు మరమ్మతులు చేయాలో స్పష్టం చేశారు. ఇవి ప్రారంభించేలోపే విద్యుత్, డ్రైనేజీ తదితరాలకు అవసరమైన రోడ్కటింగ్ పనులు ముందుగానే పూర్తి చేయాలని బల్దియా సంబంధిత విభాగాలను కోరింది.
గేటర్ హైదరాబాద్లో రూ.454.75కోట్ల స్వయంతో ప్రధాన రహదారులను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. 201 మార్చి 31వ తేదీ లోపు ఈ నగరంలోని రోడ్లన్నింటిని పూర్తిస్థాయిలో నిర్మించడంతో పాటు ప్రయాణం సాఫీగా వెళ్లేందుకు అనుకూలంగా నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.ఇందులో భాగంగా రూ.155.22కోట్ల వ్యయంతో 15 బీటీ రోడ్ల నిర్మాణం రూ.63.93 కోట్ల వ్యయంతో 60 మార్గాల్లో సీసీ రోడ్ల నిర్మాణం రూ.235.60కోట్ల వ్యయంతో వైట్ టాపింగ్ రోడ్లను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకుగాను ఇప్పటికే ప్రధాన రహదారులు, బీటీ రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ప్రధాన రహదారులు నిర్మాణాన్ని చేపట్టిన అనంతరం కాలనీలు, అంతర్గత రోడ్లను చేపట్టనున్నారు. ఈ నిర్మాణ పనులను మరింత వేగవంతంగా అతి తక్కువ సమయంలో చేపట్టాలని భావిస్తున్నప్పటికీ నగరంలోని రోడ్లను రాత్రి వేళల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు 5గంటల వరకే వేయడానికి కాంట్రాక్టర్లకు షరతులతో కూడిన అనుమతి లభిస్తున్నది. ఇందుకుగాను నగరంలో ప్రణాళికాబద్ధంగా రోడ్లను పూర్తి చేయడానికి జీహెచ్ఎంసీ మొట్టమొదటి సారిగా రోడ్ మ్యాప్ను రూపొందించింది. రోడ్డు, డ్రైన్లు, నిర్వహణను శాస్త్రీయ పద్ధతిని చేపట్టాల్సిన చర్యలపై ఇప్పటికే అనేకసార్లు ఐఐటీ, బిట్స్, జేఎన్టీయూ, ఉస్మానియా ఆస్కిల ప్రొఫెసర్లు, విషయ నిపుణులతో చర్చలు నిర్వహించారు.