వచ్చే విద్యాసంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండల విడుదల చేసింది.అన్ని ప్రవేశ పరీక్షలను అన్ లైన్ లో నిర్వహించాలని మండలి నిర్ణయి౦చింది.మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ అన్ లైన్ పరీక్షలు జరగనున్నాయి . మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న పీజీ లాసెట్, మే 31న ఎడ్సెట్ నిర్వహించనున్నారు. ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూహెచ్కు అప్పగించారు. లాసెట్, పీజీలాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ను ఓయూ నిర్వహించనుంది. ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు. పీజీసెట్ నిర్వహణ బాధ్యత మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించారు.
