కర్ణాటక రవాణా శాఖ మంత్రి రేవణ్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని అయన ప్రశంసించారు .రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోకాపేటలో గొల్ల, కుర్మ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే ..ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవణ్ణ ప్రసంగించారు.రైతులకు 24 గంటల కరెంట్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటి సారి… గొర్రెలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వమని ఆయన తెలిపారు.గొల్ల, కురుమల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నందకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
