ఎన్నో ఒడిదొడుకులు, మార్పులు అయిన తరువాత మెట్రో రైలు కల సాకరామైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు ప్రారంభమై నెల రోజులు గడిచిన సందర్బంగా అయన మీడియా తో మాట్లాడారు..ప్రారంభమైన నెల రోజుల్లోనే మెట్రో రైలు పై అన్ని వర్గాల ప్రజలనుండి మంచి స్పందన వస్తుందన్నారు.నెల రోజుల్లో 32.25లక్షల మంది ప్రయాణం చేశారని తెలిపారు ..పీపీపీలో ఈ ప్రాజెక్టు సాద్యం కాదని చాలా మంది అన్నరు,కానీ హైదరబాదీల సహకారం వల్లే సాద్యమైందని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కొంత మంది కావాలనే మెట్రో పై అసత్య ప్రచారం చేశారని తెలిపారు.24 మెట్రో స్టేషన్ లకు గాను 23 స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు .ముఖ్యమంత్రి కేసీఆర్ , కేటిఆర్ ఆదేశాల మేరకు చాలా చోట్ల అంతర్జాతీయ ప్రమాణాలతో ఫుట్ పాత్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఇప్పటి వరకు 1.5 లక్షల స్మార్ట్ కార్డ్ లు అమ్ముడయ్యాయని చెప్పారు .వారం రోజుల్లో టాయిలెట్లకు సంబందించిన టెండర్లు పూర్తి చేస్తాం అని తెలిపారు. జనవరి 15వ తేదీ లోగా మెట్రో స్టేషన్ల వద్ద సుందరీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు.