టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ ..చెన్నై ముద్దుగుమ్మ త్రిష సరికొత్త పాత్రలో దర్శనమిచ్చింది .అయితే ఈ సరికొత్త పాత్ర సినిమాల్లో కాదు ఏకంగా నిజజీవితంలో .ఒకవైపు కోలీవుడ్ లో వరస సినిమాలతో బిజీబిజీగా ఉన్న కానీ సమాజం కోసం పలు రకాలుగా సేవలు చేస్తూనే అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు .
తాజాగా ఆమెకు సినిమాల్లో బిజీబిజీ ఉన్న కానీ సినిమా షూటింగ్ కు కాస్త విరామం ప్రకటించి, స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంది. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా నెమలి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించేందుకు ముందుకొచ్చింది త్రిష.
ఇందులో భాగంగా ఆ గ్రామానికి వెళ్లిన త్రిష మరుగుదొడ్లను నిర్మించే కార్యక్రమంలో పాల్గొంటూ ఇసుక, సిమెంట్ ను తానే కలిపి, ఇటుకలతో కొంచెం గోడను నిర్మించింది. అయితే ప్రస్తుతం యూనిసెఫ్ ఇండియాకు కూడా త్రిష బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి శానిటేషన్ ప్రోగ్రామ్ లో ఆమె భాగస్వామి అయింది. అందులో భాగంగా సురక్షిత పరిసరాలకు సంబంధించి ఆమె ప్రచారం చేస్తోంది.