ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు దళితుల గురించి మాట్లాడుతూ వారికి తెలివి ఉండదు..పాడు ఉండదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.అంతకు ముందు కోడలు కొడుకును కంటాను అంటే అత్త వద్దు అంటదా అని షాకింగ్ కామెంట్స్ చేశారు .
ఆయన తాజాగా ఏకంగా యావత్తు ప్రజలను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.సోమవారం రాష్ట్రంలో వెలగపూడిలో సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కల్గించే పలు పథకాలను అమలు చేస్తూ ..సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న మాకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయరు .ఒకవేళ తమకు ఓట్లు వేయకపోతే ఏపీ ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి..ఎందుకు వేయలేదా అని సిగ్గు పడాలి అని ఆయన ఆన్నారు అని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.