బీసీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్నవిప్లవాత్మక చర్యలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. బీసీల సమస్యలు, ఆర్థికాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ నివేదికను సిద్ధం చేశామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. త్వరలోనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు నివేదిక అందజేస్తామన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన బీసీ మంత్రుల సమావేశం జరిగింది.
ఈ సమావేశం అనంతరం మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సంచార జాతులకు నేరుగారూ.లక్ష రుణం అందజేస్తామని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు కొత్త షాపులు పెట్టుకోవడానికి, ఉన్న వాటిని ఆధునీకరించడా నికి రుణాలు అందజేస్తామన్నారు. ఇకనుంచి పనిచేసే వారికే పూర్తి ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందుగా సంచార జాతులు, నాయి బ్రాహ్మణులు, విశ్వకర్మ వృత్తుల వారికి రుణాలు అందజేసేలా నివేదిక రూపొందించామని తెలిపారు. గతంలో పేదలకు ఇచ్చే స్కీమ్స్కు బ్యాంకుల సహకారం లేకపోవడం వల్ల పేదోళ్లు పేదరికానికే పరిమితం అయ్యారని చె ప్పారు. ఒకవేళ రుణాలు మంజూరు అయినా దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయే తప్ప పేదలకు అందడం లేదన్నారు. 2018-19సంక్షేమ నామ సంవత్సర మని,ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు.