తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్త తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఖాళీగా వున్నా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.అర్హులైన వారికీ వెంటనే పదోన్నతులు కలిపిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.టీజీవో అనుబంధ తెలంగాణ పురపాలక కమిషనర్ల సంఘం ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్ల పోస్టులు 50 ఖాలీగా వున్నాయని..ఇతర పురపాలక సంఘాలవారిని ఇంచార్జ్లు గా నియమించాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.పదన్నోతలు ప్రక్రియ లోనూ జాప్యం జరుగుతుందని శ్రీనివాస్ గౌడ్ మంత్రి కేటీఆర్ తో చెప్పడం తో వెంటనే స్పందించిన మంత్రి సత్వరమే నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు.
