తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర భారీ నీటిపారుద శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా పరిశీలించారు. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్దగల 6, 7 ప్యాకేజీ పనులను, కరీంనగర్ జిల్లా రామడుగులో 8వ ప్యాకేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా ఏడో ప్యాకేజీ పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి హరీష్ ఆదేశించారు. అంతేగాక జూన్ నాటికి ఎత్తిపోతల పథకం ప్రారంభించేలా పనులు చేయాలన్నారు.కాళేశ్వరం కాలువల మీద వంతెనల నిర్మాణాలు పరిశీలించిన మంత్రి ప్రాజెక్టు పనులపై అర్థరాత్రే అధికారులతో సమీక్ష చేశారు. రాత్రి రామగుండం అతిథిగృహంలో బస చేసిన మంత్రి.. ఈ రోజు పర్యటనలో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాలను పరిశీలించనున్నారు.
Inspected and reviewed the work progress of Package-6 Pump house, Surgepool and Tunnel works of Kaleswaram Lift Irrigation Scheme at Sayampet in Dharmaram mandal of Peddapally district. pic.twitter.com/5TQV831ecq
— Harish Rao Thanneeru (@trsharish) January 20, 2018