మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా, సీఈవో సీపీ గుర్నానితో తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే.ఈ భేటి సందర్బంగా వరంగల్లో టెక్ మహీంద్రా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆనంద్ మహీంద్రా కేటీఆర్ కు తెలిపారు. వరంగల్ నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి టెక్ మహీంద్రా సంస్థను వరంగల్ మహానగరంలో నెలకొల్పడానికి అంగీకరించినందుకు ఆనంద్ మహీంద్రాకు ,సంస్థ సీఈవో సీపీ గుర్నానికి మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు వరంగల్ నగర ప్రజల తరపున మేయర్ నరేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అభివృద్ది చెందుతున్న మహానగరానికి ఇదొక మంచి పరిణామమని మేయర్ నరేందర్ అన్నారు.
