అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద స్థితిలో కన్నుమూశారు. పేయింగ్ గెస్ట్గా ఉంటున్న ఇంట్లోని తన రూం నుండి శుక్రవారం ఉదయం బయటకు రాకపోవటంతో అనుమానంతో పోలీసులకు ఇంటి యజమాని సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు.
కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థ ఆన్సైట్పై మూడున్నరేళ్ల క్రితం కృష్ణ చైతన్య అమెరికాకు వెళ్లారు. మూడు నెలల క్రితమే డల్లాస్లోని సౌత్ వెస్ట్ ఏయిర్ లైన్స్కుఉద్యోగం మారటంతో అక్కడే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. అదే నివాసయంలో కృష్ణచైతన్య మృత్యువాత పడ్డారు.
కాగా, తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు కృష్ణచైతన్య మృతదేహాన్ని స్వస్థలంకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సంప్రదింపులు జరిపి మృతదేహం సకాలంలో వచ్చేలా మంత్రి హరీష్ రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోస్టు మార్టం పూర్తి అయిందని, వచ్చే గురువారం వరకు మృతదేహం హైదరాబాద్కు చేరుకోనుందని సమాచారం.