తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన నెహాల్ (5) నియమితుడయ్యాడు.నేహాల్ను ప్రచారకర్తగా రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నియమించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, రీడిజైనింగ్పై సీఎం చేసిన సూచనలను అలవోకగా నేహాల్ చెప్పేస్తున్నాడు. రీడిజైనింగ్ గురించి అనర్గళంగా 20 నిమిషాల పాటు నేహాల్ ప్రసంగించాడు. యూకేజీ చదువుతున్న ఐదేండ్ల బాలుడు నేహాల్ ప్రతిభను చూసి ఆశ్యర్యపోయిన హరీశ్రావు ఈ సందర్భంగా బాలుడిని అభినందించాడు. నేహాల్ చదువుకు అయ్యే ఖర్చు అంతా నీటిపారుదల శాఖ భరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను కలవాలని ఉందని చిన్నారి నేహాల్ తన కోరికను మంత్రి హరీశ్ రావుకు వెలిబుచ్చాడు.
see also : మాకు ఓట్లేయకుంటే.. ప్రజలే సిగ్గుపడాలి..!!
see also : మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం కేసీఆర్..!
see also :బిగ్ బ్రేకింగ్ : టీ బీజేపీకి బిగ్ షాక్..సీనియర్ నేత గుడ్ బై