తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..త్వరలోనే రాష్ట్రంలో ని వైద్యారోగ్య శాఖలో 10 వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు.విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
see also : ఖాళీ స్థలం ఉంటే పార్కింగ్కు ఇవ్వండి..ట్విటర్లో మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
see also : మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతికి అసలు కారణం ఇదేనా..?