తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అర్భన్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిపక్షాలకు నిద్ర కరువవుతుంది.కనుచూపు మేర అధికారంలోకి రాలేమని గ్రహించిన ప్రతిపక్షాలు అధికార పార్టీపై అవాకులు చవాకులు పేలుస్తున్నారు.నాడు స్వరాష్ట్ర సాధన కోసం జైలుకు వెళ్ళిన కేటీఆర్ పై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అన్నారు.తన నియోజక వర్గంలో ప్రతి నెల ప్రజల సమస్యలపై మాట్లాడుతూనే మరోవైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆయన వివరించారు .నాటి ఉద్యమ నేతనే నేటి మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడం మన అదృష్టంగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు తగిన గుర్తింపు నిస్తున్న సందర్భంలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన చాగంటి రమేష్ 7,50,000 రూ/-ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కూడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి గారు వికలాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డి, గారు పశ్చిమ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎడవెల్లి కృష్ణారెడ్డి గారు మరియుపశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
