మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగస్థలం .ఈ సినిమా మొదటి పాటను గత కొన్ని రోజులక్రితమే విడుధలకాగా తాజాగా మరో పాట ” రంగా.. రంగ.. రంగస్థలానా ” అనే పాట ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటలో రాంచరణ్ అదరగొట్టాడు.డుంగురు.. డుంగురు అంటూ తీన్మార్ స్టెప్పులు వేశాడు. వినిపించే లా కాదు.. కనిపించేలా వాయించాలి అంటూ చెర్రీ డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది.కాగా ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.
