ప్రేమించిన యువతిని ప్రియుడు కొట్టి చంపాడు. అంతటితో అగాకుండ చాలా దారుణంగా ఆయువతిపై కర్కషంగా ప్రవర్తించి ఆమె ఆనావాలు కూడ కనబడకుండ చేయ్యలాని చేసిన పనికి అడ్డంగా దొరికి జైల్ పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం భుజలాపురంలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Posted by Rambabu Sankella on Tuesday, 6 March 2018
నరేశ్ అనే యువకుడు పెళ్లి పేరుతో యువతి భార్గవిని తన వ్యవసాయ బావి వద్దకు పిలిచాడు. వ్యవసాయ బావి వద్దకు వచ్చిన యువతిని తీవ్రంగా కొట్టి చంపి ఆపై అక్కడే పూడ్చి పెట్టాడు. మోత్కూరు పోలీసు స్టేషన్ లోమృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు నరేశ్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా భార్గవిని చంపినట్లు అంగీకరించాడు. నిందితుడి సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ బావి వద్దకు చేరుకుని భార్గవి మృతదేహాన్ని వెలికితీశారు . చాలా అత్యంత దారుణంగా యువతిని పూడ్చి పెట్టాడు. అంతేకాదు నరేశ్ రెండ్రోజుల క్రితమే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడని సమచారం.