Home / SLIDER / 2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?

2018-19 బడ్జెట్.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..?

ఇవాళ శాసన సభలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ 2018-19సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.అయితే మొత్తం బడ్జెట్‌ రూ.1,74,453కోట్లు,రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు,రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు, రాష్ట్ర ఆదాయం రూ.73,751కోట్లు,కేంద్రం వాటా రూ.29,041కోట్లుగా ఉంది .

SEE ALSO :తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19..పూర్తి వివరాలు

ఈ క్రమంలో బడ్జెట్ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ర్టానికి ఉన్న ఆదాయ వనరులను, రాష్ర్టానికి ఉన్న అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు మధ్య పూర్తి సమన్వయం కుదురుస్తూ బడ్జెట్ రూపొందించారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.ఎక్కువ శాతం ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు.

SEE ALSO : చంద్ర‌బాబు తాజా భారీ కుంభ‌కోణం ఆధారాల‌తో స‌హా వెలుగులోకి..!

2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందన్నారు.రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు.

SEE ALSO :వైఎస్ జగన్ ఏం చెప్పాడో అదే పవన్ కళ్యాణ్ చెప్పింది… చంద్రబాబు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat