టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నరా ..ఇప్పటికే ఇటు టీడీపీ పార్టీను నమ్ముకున్నవారికి మాత్రమే కాకుండా ఆ పార్టీకి వెన్నుముక్కగా నిలుస్తూ వస్తున్న బీసీ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో సదరు ఎమ్మెల్యే బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారు అని ఆయన ప్రకటించేశారు.
తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేస్తున్నారు .అందుకే రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ పార్టీ పెట్టనున్నట్లు ఆయన మీడియాకు వివరించారు .