ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీని నమ్మించి మోసం చేసిన బీజేపి కి అక్కడి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కి కూడా ఇదే గతి పట్టించానని, ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయిన చరిత్రహీనం కాక తప్పదని బాబు విమర్శించారు.
విభజన హమీలను నేరవేర్చాల్సిన అవసరం లేదా అని కేంద్రప్రభుత్వంన్ని ప్రశ్నించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో ఉందని మోడీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంటే మోసం చేసిందని ఫైర్ అయ్యారు. కర్నాటకలో తెలుగు వాళ్లు ఎక్కడున్న బీజేపిని దెబ్బతీయాలని గతంలోనే పిలుపు ఇచ్చినట్టు తెలిపారు. తెలుగు వాళ్ల దెబ్బ బీజేపి రుచి చూసిందని చంద్రబాబు అన్నారు.