Home / SLIDER / రైతుబంధు చెక్కుల పంపిణీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!

రైతుబంధు చెక్కుల పంపిణీ సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!

భూ రికార్డుల ప్రక్షాళన, పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు అధికార యంత్రాంగం విశ్రమించవద్దని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ రోజు వరకు జరిగిన భూమి అమ్మకం,కొనుగోళ్లకు సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేసి, దాని ప్రకారం అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని చెప్పారు. పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను కూడా సవరించాలని కోరారు. వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, ఇంకా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు, మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీని వల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్ గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం కోరారు.

జిల్లాల పునర్విభజన వల్ల కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమయిందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించాలని ఉద్భోధించారు. వచ్చే నెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుందని, రైతులకు జీవిత భీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూమి రికార్డులు సరిగా ఉండాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన పరిపూర్ణమయి, భూమి యాజమాన్యంపై స్పష్టత వస్తే తప్ప ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని సీఎం అన్నారు. కొన్ని సమస్యలు వచ్చాయని అధైర్య పడవద్దని, బుక్కులు, చెక్కులిచ్చే కార్యక్రమాన్ని వందశాతం విజయవంతం చేయడానికి పునరుత్తేజం పొందాలని సీఎం పిలుపునిచ్చారు.

కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రగతిభవన్ లో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

Image may contain: 3 people, people sitting

స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ముఖ్య కార్యదర్శులు, కలెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు ఎన్ని పాసు పుస్తకాలు పంపిణీ చేశారు? ఎంత మందికి చెక్కులిచ్చారు? మిగతా వారికి ఏ కారణం చేత పంపిణీ చేయలేదు? తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ప్రతీ రైతుకూ పాసు బుక్కు, చెక్కు అందడానికి ఏ చర్యలు తీసుకోవాలి? అనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో సీఎం చేసిన సూచనలు:
———————————————
• పాసు పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వందశాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి

• భారతదేశానికి రాలేకపోతున్న ఎన్.ఆర్.ఐ.లకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి

• ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాసు పుస్తకాలను కూడా పక్కన పెట్టాలి.

• భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’ వెబ్ సైట్ నిర్వహించాలని నిర్ణయించినందున, అందులో వివరాలు సరిగా ఉండేందుకు రికార్డులు సరిగా ఉండాలి. అసమగ్ర వివరాలతో ‘ధరణి’ నిర్వహించలేం

• భూ రికార్డులను సక్రమంగా నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి

• తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని గుర్తించి, క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి

• ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసిల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి

• మాన్యువల్ గా మ్యుటేషన్ చేసిన వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి, దాని ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఆన్ లైన్ లో మార్పులను నమోదు చేయడాన్ని నిలుపుదల చేయలేదు. ఈ విషయంలో తహసిల్దార్లకు ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat