కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్కతా సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాటు కాంగ్రెస్, జేడీఎస్, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా కుమారస్వామికి, అతని కార్యకర్తలకు, కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
Congratulations to Sri @hd_kumaraswamy Ji on swearing in as the chief minister. Good luck to his team & people of Karnataka
— KTR (@KTRTRS) May 23, 2018