తెలంగాణ వంటకాలకు పలువురు ప్రముఖ సినీ నటులు ఫిదా అయ్యారు.ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో కొంతమంది ప్రముఖ సినీనటులు ఒకచోట చేరి సందడి చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో సినీ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా, ప్రిన్స్, బెనర్జీ, హేమా తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు అభిమానులను అలరించారు. తెలంగాణ వంటకాల రుచులంటే చాలా ఇష్టమని పలువురు నటులు చెప్పారు . తెలంగాణ రాష్ట్రానికి చెందిన వందకుపైగా వంటకాలతో పాటు ఇండియన్, చైనీస్కు చెందిన రుచులను ఒకే చోట అందించడం చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు.
