Home / SLIDER / ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలి…మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టాలి…మంత్రి తుమ్మల

” రైతుబంధు పథకం ” అమలులో తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను నెంబర్ వన్  జిల్లాగా నిలబెట్టాలని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జూన్ 15 కంటే ముందు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. టీటీడీసీలో రైతుబంధు పథకం పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.రైతుబంధు పథకం కొండంత అండనిచ్చిందంటున్నారు. సాంకేతిక సమస్యలు దొర్లినా.. తప్పులను సరిచేసి రైతులకు కొత్తపాసు పుస్తకాలు రైతులకు తక్షణం అందజేయాలన్నారు.

రైతులకు ఏం ఇబ్బంది రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అందిస్తున్నారన్నారు.తెలంగాణ సర్కార్‌ అందించిన పంట పెట్టుబడి సాయంతో తొలకరికి ముందే సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మిగిలిపోయిన భూ వివాదాలను కూడ తక్షణం పరిష్కరించాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. ఈ కార్యక్రామానికి రైతుబంధు పథకం స్పెషల్ ఆఫీసర్ నీతూ కుమారి ప్రసాద్, కలెక్టర్ లోకేష్ కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు హాజరయ్యారు.అనంతరం రూరల్ మండలం తెల్దారుపల్లిలో డబుల్ బెడ్‌ రూం ఇండ్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat