ఉమెన్స్ టీ20 ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మలేసియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదటగా శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. శ్రీలంక ప్లేయర్లలో మెండీస్(27), హన్సిక పెరెరా(46) తప్పా మిగతా ప్లేయర్లు రెండంకెలా స్కోరు కూడా చేయలేకపోయారు.108 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్..18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలుపొందింది. భారత ప్లేయర్లలో వేదా కృష్ణమూర్లి(29- నాటౌట్), కౌర్(24), మిథాలీ(23), అనుజా పాటిల్ (19-నాటౌట్) మందానా(12) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఏక్తా బిష్(2), గోస్వామి, అనూజ పాటిల్, పూనమ్ యాదవ్ తలో వికెట్ తీశారు.
That is it! India beat Sri Lanka by seven wickets and seven balls to spare.
Veda 29* from 23
Harmanpreet 24 from 25
Mithali 23 from 33
Anuja 19* from 16
Ekta Bisht 2/10#INDvSL #ACC #WAC2018 pic.twitter.com/ajzUDftQOp— BCCI Women (@BCCIWomen) June 7, 2018