తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి రాష్ట్ర ప్రజలనుండే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కొంతమంది పెద్ద పెద్ద రైతులు,మంత్రులు,నాయకలులు ,అధికారులు రైతు బంధు చెక్కును తిరిగి ప్రభుత్వానికే అందజేస్తున్నారు.
అందులోభాగంగానే తమకు అందించిన రైతు బంధు చెక్కును నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేశారు. ఆ సొమ్మును రైతు సంక్షేమానికి అందించాలని కోరారు. జడ్చర్ల సమీపంలోని హేమాజీపూర్లో రాజీవ్ కనకాల కుటుంబానికి వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు పథకంలో భాగంగా ఆ భూమికి గాను వీరికి రూ.29 వేల పెట్టుబడి సాయం కింద అధికారులు చెక్కు అందించారు.చెక్కును తీసుకున్న రాజీవ్ కనకాల దంపతులు గురువారం గ్రామానికి వెళ్లి ఎమ్మార్వో రాంబాయిని కలిశారు. ప్రభుత్వం నుంచి తమకు అందిన చెక్కును ఎమ్మార్వోకు అందించారు.