ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మరో మరో ప్రైవేటు విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడింది. అందులో భాగంగా సింహపురి విద్యుత్ సంస్థ నుంచి ఏకంగా 400 మెగావాట్ల కరెంటును కొనేందుకు బాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు అనుమతించింది. అయితే ఈ సంస్థ
ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడం విశేషం.
అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా యూనిట్కు రూ.4.80 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఏకంగా 12 ఏళ్ల కాలపరిమితితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్)పై దాదాపు రూ.21 వేల కోట్ల అదనపు భారం పడనుంది.సింహపురి సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని డిస్కమ్లు తీవ్రంగా వ్యతిరేకించాయి.
రాష్ట్రంలో ఇప్పటికే మిగులు విద్యుత్ ఉందని, ఇంకా కొనాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ రంగ నిపుణులు విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ముందు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఏపీఈఆర్సీ హడావుడిగా హైదరాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ తంతు ముగించింది. ఈ నెల 10వ తేదీన పీపీఏకు సంబంధించిన
ఆదేశాలు ఇస్తామని ప్రకటించింది.