Home / SLIDER / నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!

నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!

ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప పథకం అని అన్నారు.ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుపేద వారికి కంటి వైద్యం చేయించుకోలేని ముసలి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. అలాగే కంటి వైద్యం కోసం వచ్చిన వారికి కంటి చూపు కోల్పోయిన వారికి అక్కడే సదరం సర్టిఫికేట్ లు ఇచ్చి వారికి రావాల్సిన ప్రభుత్వం పెన్షన్ అందజేయాలని కోరారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే తన వంతు సహాయంగా కంటి వైద్యం కోసం వచ్చే వారికి తన సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ పథకం ద్వారా కేసీఆర్ గారు కంటి వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వారి కుటుంబంలో గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారని అని అన్నారు.తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండటం ఒక వరం అని కేసీఆర్ గారి నేతృత్వంలో మనం ప్రజాప్రతినిధులగా ఉండి ప్రజలకు సేవ చేయడం మరో వరం అని అన్నారు.

Image may contain: 12 people, including Ravinderreddy Gogula, people smiling, people standing and wedding

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat