గత వారం రోజుల నుంచి భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు తమ వంతు సాయం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 25 కోట్లతో పాటు తాను వ్యక్తిగతంగా నెల వేతనాన్ని కేరళ సీఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు . తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి తమకు తోచినంతలో స్పందించాల్సిందిగా ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కోరారు.మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మొదటగా వెంటనే స్పందించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద తన వంతుగా ఒక నెల జీతాన్ని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతునట్లు తెలిపారు.
