ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం చంద్రబాబు హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పటికే హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో అధికారికంగా నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వాధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
