విమర్శలు చేయడంలో ముందుండి…ఆచరించడంలో ఆమడ దూరంలో ఉండే కాంగ్రెస్ పార్టీ తాజాగా మరోమారు తన నైజాన్ని చాటుకుంది. ఎందరో ఆశావహులు ఉండగా…పదవుల పంపకం మాత్రం నేతల భార్యలకు కట్టబెట్టారు. ఈ ఉదంతం తాజాగా డీసీసీ పదవుల నియామకంలో ఈ విషయం స్పష్టమైంది.
ముగ్గురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది. ఇద్దరు ఎమ్మెల్యేల భార్యలకు డీసీసీ పదవులు కట్టబెట్టింది. భూపాలపల్లికి గండ్ర జ్యోతి, సంగారెడ్డికి నిర్మలా జగ్గారెడ్డి , మంచిర్యాలకు కొక్కిరాల సురేఖను నియమించారు. ఐదుగురు సిట్టింగ్ డీసీసీల కొనసాగించారు. అసిఫాబాద్కు ఆత్రం సక్కు నియమించింది. వికారాబాద్ ను రోహిత్ రెడ్డికి కట్టబెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వనమాకు అప్పగించారు. ఎందరో ఆశావహులు ఉన్నప్పటికీ ఈ రకంగా నేతల సతీమణులకు పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ తీరును చాటిచెప్తోందని అంటున్నారు.