కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి ఏపీ అధికార టీడీపీ పార్టీ బయటకొచ్చిన తరువాత ప్రధాని మోదీ ఏపీకి రావడం ఇదే మొదటిసారి. గుంటూరు నగర శివారులో ఏర్పాటు చేసిన బీజేపీ ప్రజాచైతన్య సభలో ఆయన.. ‘అక్షర క్రమంలోనే కాకుండా అన్ని రంగాల్లో, అంశాల్లో అగ్రగాములైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.అనంతరం బాబు పై విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎవరితోనైనా జతకట్టే చంద్రబాబుకు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని మోదీ అన్నారు. ఎన్టీఆర్ను అవమానించిన కాంగ్రెస్పార్టీతో బాబు పొత్తు ఎలా పెట్టుకుంటారని మోదీ నిలదీశారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు పెట్టండి నిధుల గురించి తరువాత చూదాం అని చంద్రబాబు నాతో అన్నాడని ప్రధాని మోడీ అన్నారు.
