ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జనం తీర్పు ఈవీఎంల్లో భద్రం అయ్యి ఉంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం వేచి చూస్తున్నాయి. మొత్తం ఏపీలో తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ 25 లోక్సభ, 175 శాసనసభ స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాయి. జాతీయ పార్టీలైన బీజేపీ 24 లోక్సభ, 173 అసెంబ్లీ స్థానాల్లోనూ, కాంగ్రెస్ పార్టీ 25 లోక్సభ 174 శాసనసభ స్థానాల్లో పోటి చేశారు.మొత్తం అసెంబ్లీ బరిలో 2118 మంది అభ్యర్థులు ఉండగా అందులో 1945 మంది పురుషులు, 172 మంది మహిళలు, ఓ ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. అయితే ఎన్నికల ముగిశాక వైసీపీకి భారీ మెజార్టీతో గెలుస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తప్పకుండా 120 నుండి 130 సీట్లు వైఎస్ జగన్ గెలవబోతున్నాడని భారీగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకా ఎన్నికల ఫలితాల రాకముందే వైసీపీ గెలుస్తుందని టీడీపీ యువ నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీపి కండువా కప్పుకోవాడాని సిద్దం అయినట్లు తెలస్తుంది. అంతేకాదు ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదని చాల మంది మే 23 తరువాత వైసీపీలోకి భారీగా వలస వస్తారని సమచారం. జిల్లా నుండి నియోజక వర్డ నేతలు, నియోజక వర్గ నుండి మండల నాయకులు, మండల నాయకుల నుండి గ్రామంలోని తెలుగు తమ్ముళ్లందరు ఇప్పటికు వైసీపీలో చేరడానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి మే 23 తరువాత ఏపీలో ఏం జరుగుతుందో.
