దటీజ్ జగన్ అని పార్టీలు ఏవైనా నేతలు కీర్తించాల్సిన పరిస్థితిని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించారు. సినీటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం అసెంబ్లీ స్ధానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఆయనపై వైసీపీ అభ్యర్థిగా ఇక్చాల్ బరిలో దిగారు. అయితే ఓడిపోయారు. అయితే, ఇక్బాల్కు జగన్ తగు అవకాశం కల్పించారు. ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి.. ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తామని తెలిపారు. “సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చాం… నలుగురు గెలిచారు.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనను ఎమ్మెల్సీని చేస్తాం“ అని హామీ ఇచ్చారు. కాగా, సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన తొలి ఎమ్మెల్సీ ఇక్బాలే కావడం విశేషం.
ఇదిలాఉండగా, మాజీ సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు. 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేసిన టీడీపీకి ఆ దేవుడు రాసిన రాత ఇది 23వ తేదీన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని ఎద్దేవా చేశారు. నాన్న గారి పాలన గుర్తుకు వచ్చేలా నా పాలన ఉంటుందని స్పష్టం చేశారు.