మంచి పని ఎవరు తలపెట్టిన సమర్థించాలని జగ్గారెడ్డి అన్నారు. `ప్రాజెక్టులు, డ్యాంలను రైతులు, ప్రజల కోసం ఎవరు కట్టినా మంచిదే. తెలంగాణ తొలి డ్యాం నాగార్జున సాగర్ నెహ్రూ ప్రధానిగా కాంగ్రెస్ సీఎం లు పూర్తి చేశారు. శ్రీశైలం కూడా ఇందిరా ప్రధానిగా కాంగ్రెస్ సీఎంలు ఉన్నప్పుడే పూర్తి చేశారు. మా సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నే నిర్మించారు. నాడు కాంగ్రెస్ సీఎంలు కట్టినా నేడు సీఎం కెసిఆర్ కట్టినా అన్ని తెలంగాణ ప్రజలకోసమే అని భావించాలి. వాటిని రాజకీయం చేయొద్దు. ఒక రకంగా సోనియా , రాహుల్ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కేసీఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కడుతున్నాడు అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయిన ఏడాదిలో సింగూరు, మంజీర, మహబూబ్సాగర్ నీళ్ళతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన కేసీఆర్ గారికి ఘనంగా సన్మానం చేస్తాం` అని సంచలన ప్రకటన చేశారు.
కాళేశ్వరం అవినీతి గురించి తాను మాట్లాడనని స్పష్టం చేసిన జగ్గారెడ్డి అది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చూసుకుంటారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, మహారాష్ట్ర సీఎం వచ్చినా తప్పులేదని అన్నారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వారు విచ్చేస్తున్నారని చెప్పారు.