అన్నారం బ్యారేజ్ వద్ద సామూహిక వనభోజనాల కార్యక్రమాన్ని ఇవాళ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏర్పాటుచేశారు. జల జాతర సందర్భంగా గోదావరి తల్లికి పుష్పాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ,ఎమ్మెల్యేలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,చెన్నూర్ నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వేలాది మంది కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ,అన్నారం బ్యారేజ్లు జలభాండాగారాలను తలపిస్తున్నాయి. ప్రాణహిత నుంచి గోదావరిలోకి ఇన్ఫ్లో నిలకడగా వస్తుండటంతో నీటినిల్వ రోజురోజుకి పెరిగిపోతోంది. మేడిగడ్డ బరాజ్లో క్రమేణా నీటినిల్వ పెరుగుతూ 6.70 టీఎంసీలకు చేరగా అన్నారం బరాజ్లో నీటి నిల్వ 4.59 టీఎంసీలకు పెరిగింది.
Held Kaleshwaram Jala Jathara – Community lunch meeting at Annaram Barrage today. pic.twitter.com/UhtDaB1NBN
— Balka Suman (@balkasumantrs) July 16, 2019
A few glimpses from the Kaleshwaram Jala Jathara community lunch meeting held at Annaram Barrage. pic.twitter.com/z6KggIajK7
— Balka Suman (@balkasumantrs) July 16, 2019