ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఈ అంశంపై స్పందించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ మాట్లాడడాన్ని నేను చూస్తున్నానని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మాట్లాడతానని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. కాగా ఇప్పటికే ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ తన మద్దతును తెలియజేసారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు.
I hear all of your concern on the issue of uranium mining in Nallamala forest. Assure you all that i shall personally discuss the matter with Hon’ble CM KCR Garu
— KTR (@KTRTRS) September 13, 2019