ఆర్థిక శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావుతో ఇకపై ఘర్షణ ఉండదు అని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్కు ప్రజలు రెండోసారి కూడా పట్టం కట్టారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తాను. ఇకపై హరీష్రావుతో ఘర్షణ ఉండదు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరి ప్రచారం వారిదే. సంగారెడ్డిలో హరీష్రావుతో ప్రచారం చేసుకున్నా అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి అనవసరంగా మాట్లాడి చెడగొడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో పెరిగిన గ్రాఫ్ను రేవంత్ రెడ్డి జీరో చేసుకున్నారు అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
