నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. విద్యుత్శాఖలో ఖాళీల భర్తీకి టీఎస్ ఎస్పీడీసీఎల్ నోటీఫికేషన్ జారీచేసింది. 2939 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ లైన్మెన్-2438, జూనియర్ పర్సనల్ ఆఫీసర్-24, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్-477 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను సంస్థ వెబ్సైట్ www.tssouthernpower.com కు లాగినై తెలుసుకోవచ్చు. హుజూర్ నగర్లో ఉపఎన్నికలు ఉన్నందున సూర్యాపేట జిల్లా మినహాయించి అన్ని జిల్లాల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.