తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన అనంతరం డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి బాబు రాజేంద్రప్రసాద్ పై నిప్పులు చెరిగారు. రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని విరుచుకుపడటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పార్టీ మారిన తరువాత తను తప్పుడు వ్యక్తిగా ప్రసారం చేస్తుండడం పట్ల స్వతహాగానే దూకుడు స్వభావం ఉన్న వల్లభనేని రాజేంద్ర ప్రసాద్ పై విమర్శలు చేశారు. అలాగే రాజేంద్రప్రసాద్ గతంలో ఓ పొలానికి నీరు ఇచ్చే విషయంలో పై నుండి పొలాలకు కాదని భూములు ఇచ్చిన రైతుల పొలాలకు కాదని తమకు కావాల్సిన తమకు అవసరమైన భూములకు నీరిచ్చే వివాదం కూడా వీరిద్దరికి గొడవలు ఉన్నట్లు అర్థమవుతోంది. అసలు గొడవ ప్రారంభం అయింది కూడా ఈ పొలాలకు నీరు ఇచ్చే అంశం లోనే. మొత్తం మీద ఏ ఛానల్ డిబేట్ పెట్టిన తన వాక్చాతుర్యం అనుభవంతో నోటికొచ్చినట్టు మాట్లాడే బాబు రాజేంద్రప్రసాద్ కి వల్లభనేని వంశీ ఆగ్రహానికి గురికాక తప్పలేదు.
