ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు ఆర్టీసీకి రూ.100 కోట్లు ఇస్తాం. ఎప్పుడు చెప్పానా టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతతో చెప్పినం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం, కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వనంత జీతం అంగన్వాడీలకు ఇస్తున్నం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి పెడదారి పట్టారు. దీనికి యూనియన్లే బాధ్యత వహించాలి అని అన్నారు. ప్రతిపక్షాల పాలన ఉన్న రాష్ట్రాలలో ఎక్కడా ఆర్టీసీ ప్రభుత్వంలో వీలినం కాలేదన్నారు. ప్రతిపక్షాల నేతల వల్లే ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు.
