తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అండ నిలిచారు.
ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
టేక్మాల్ మండల రిపోర్టర్ పిండి లింగం అనారోగ్యంతో కొద్దికాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే. లింగం మరణించిన తరువాత కుటుంబం పోషణ గడవడం గగనం అయిందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని పిండి లింగం భార్య సంగీత (పూర్ణిమా) ఆశ్రయించగా ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు ని కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
దీంతో మంత్రి హరీష్ రావు ఉన్నత అధికారులతో మాట్లాడి లింగం భార్యకు టేక్మాల్ మండల జూనియర్ కాలేజ్ లో ఔట్ సోర్సింగ్ జాబ్ కల్పించడంతో పాటు. అర్ధాంతరంగా ఆగిపోయిన తన బాబు చదువు గూర్చి తెలుసుకున్న మంత్రి తనను కాలేజ్ లో రి-జాయిన్ చేపించడమే కాకుండ పై చదువులకు కావల్సిన సహాయం చేస్తానని మంత్రి అన్నారు.కుటుంబం గడవడం కష్టమై ఇబ్బందులు పడుతున్న మా కుటుంబానికి అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పిండి సంగీత .