హైదరాబాద్లో జరిగిన దిషా అత్యారం, హత్య ఘటనపై ఇవాళ లోక్సభ జీరో అవర్లో చర్చించారు. అత్యాచార ఘటనపై ఒక రోజు చర్చ చేపట్టి, కఠినతరమైన చట్టం తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత డిమాండ్ చేశారు.
నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ప్రతి ఏడాది 33వేల అత్యాచార కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ కల్పించే విధంగా కఠిన చట్టం తేవాలన్నారు.
పార్టీలకు అతీతంగా చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. దిషా హత్య ఘటన దేశమంతా కలిచివేసిందన్నారు.