సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో టీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి హరీశ్రావు ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..’మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నా.. పని విషయంలో అలసత్వం వద్దు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికెళ్లి ప్రతి ఓటరును కలవండి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించండి” అని అన్నారు.
” టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను, అవార్డులను ఓటర్లతో పంచుకోండి. టికెట్ రాలేదని ఆశావహులు ఎవరూ నిరాశ చెందొద్దు. అవకాశం రానివారిని నామినేటెడ్ పోస్టులతో గౌరవించుకుందాం. వార్డుల వారీగా ప్రచారానికి ప్రణాళికలు, వ్యూహాలు సిద్ధం చేయాలి. ప్రజలు కోరుకున్న..గెలిచే అభ్యర్థులనే పార్టీ ఎంపిక చేస్తుంది. పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కష్టపడి పనిచేయాలని’ హరీశ్ రావు సూచించారు.