తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిరిసిల్ల. సిరిసిల్లలో జేఎన్టీయూ ఏర్పాటు కోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
ఇందుకు కావాల్సిన కాలేజీ సకల సౌకర్యాల నిమిత్తం రూ.300కోట్లు అవసరం అవుతాయని కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు.
ఈ క్రమంలో మొదటి విద్యాసంవత్సరం కోసం రూ.50-100కోట్లు రానున్న బడ్జెట్లో కేటాయించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు,మంథనిలో రెండు జేఎన్టీయూ కళాశాలలు ఉన్నాయి.