మహానటి కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందా..? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బీజేపీ నేతకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన తనయుడ్ని కీర్తి వివాహమాడబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇరు కుటుంబాలు ఇప్పటికే అన్ని విషయాలు మాట్లాడుకున్నారని.. పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునేందుకు కీర్తి కూడా ఒప్పుకుందని తెలుస్తోంది.
వివాహ వేదిక, పెళ్లి తేదీ తదితర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.
మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో రంగ్దే, గుడ్లక్ సఖి, మిస్ ఇండియా చిత్రాలతో పాటు తమిళ్లో రజనీకాంత్ అన్నాత్తే, పెంగ్విన్, మలయాళంలో మరక్కర్ చిత్రాల్లో నటిస్తోంది.
అయితే కీర్తి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఏడు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలో ఆమె 20కి పైగా చిత్రాల్లో నటించారు. ఇక మహానటి చిత్రానికి గానూ కీర్తికి జాతీయ అవార్డు కూడా వచ్చింది.