రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం చిన్నరావిరాల గ్రామానికి చెందిన కొలన్ సుధాకర్రెడ్డి ఇటీవల మరణించాడు.
ఆయన భార్య కొలన్ విజయలక్ష్మికి రూ. 5లక్షల రైతుబీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏడీ సత్యనారాయణ, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, ఏఈవో కల్యాణి, సర్పంచ్ సురకంటి వనజశ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ అనితమహేందర్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పూజారి చక్రవర్తిగౌడ్ ఉన్నారు.