Home / SLIDER / 8 కోట్లతో మేడిపూర్ లో చెక్ డ్యాం నిర్మాణానికి” మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన

8 కోట్లతో మేడిపూర్ లో చెక్ డ్యాం నిర్మాణానికి” మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన

జగిత్యాల జిల్లా, ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో వెల్గటూర్ పెద్ద వాకుపై రూ 4.60 కోట్లతో నూతనంగా నిర్మించే చెక్ డ్యాం/ ఆనకట్టకు ఈరోజు శంకుస్థాపన, అనంతరం గొల్లపల్లి మండలం లొత్తునూర్, చిల్వకోడూర్ గ్రామాల్లో సదా జల వాగు పై 3.61 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యాం/ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కోటి కుటుంబాలతో నాలుగు కోట్ల జనాభా ఉన్నది. ఇందులో 60 లక్షలు రైతు కుటుంబాలు. రైతు పది వేళ్ళు భూమిలో పనిచేస్తేనే మిగతా వారి అయిదు వేళ్ళు నోట్లోకి వెళ్ళుతాయి. ప్రజల ఆకలి తీర్చేది రైతులు అయితే దేశాన్ని కాపాడేది సైనికులు. అందుకే వీరిద్దరిని కాపాడుకోవాలి.

రైతులకు జీవనాధారం నీళ్ళు, కరంటు. ఈరెండు అందించగలిగితే రైతులు చింత లేకుండా పంటలు పుష్కలంగా పండిస్తారు.ధర్మపురి నియోజకవర్గ ప్రాంత రైతులు చైతన్యవంతులు. సమయానుకూలంగా పంటలను సాగు చేసి రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులను సాదిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 24 లక్షల కరంటు మోటార్ల కింద యాబై లక్షల ఎకరాలు సాగులో ఉన్నది. దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటలు కరంటును ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat